News September 28, 2024
పేద ఖైదీలకు సాయం అందించాలి: ప్రకాశం కలెక్టర్

బెయిల్ వచ్చిన షూరిటి లేక ఇబ్బంది పడుతున్న పేద ఖైదీలకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందించాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపవర్మెంట్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఖైదీల బైయిల్ వివరాలు, స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా ఖైదీలకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 16, 2025
ఉపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్ ఆదేశం

నైపుణ్యాభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు, అనుబంధ విభాగాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో బుధవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థితిగతులు, కొత్త వాటిని స్థాపించేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి అధికారులు వివరించగా, కలెక్టర్ పలు సూచనలు చేశారు.
News October 15, 2025
రేపు కూడా ప్రకాశం జిల్లాకు భారీ వర్షసూచన

ప్రకాశం జిల్లాలో గురువారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. అలాగే భారీ హోర్డింగ్ ల వద్ద, చెట్ల వద్ద వర్షం సమయంలో నిలబడరాదన్నారు. కాగా బుధవారం సాయంత్రం జిల్లాలోని పలుచోట్ల మోస్తారు వర్షం కురిసింది.
News October 15, 2025
ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.