News January 23, 2025

పేర్లు రానివారు ఆందోళన చెందవద్దు: ASF అడిషనల్ కలెక్టర్

image

తిర్యాణి మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీలో గురువారం ప్రజాపాలన గ్రామసభను తహశీల్దార్ మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి హాజరయ్యారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా సర్వే జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. అర్హులంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Similar News

News November 20, 2025

మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.

News November 20, 2025

మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.

News November 20, 2025

సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.