News January 23, 2025
పేర్లు రానివారు దరఖాస్తు సమర్పించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల అమల్లో భాగంగా గ్రామసభలలో చదివే జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
సిరిసిల్ల ప్రజావాణికి 154 వినతులు

ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇన్ ఛార్జ్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 154 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు పంపారు. గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల వెంటనే పరిష్కరించాలని సూచించారు.
News February 23, 2026
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజావాణిలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్రమ పద్ధతిలో స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులు పాల్గొన్నారు.
News February 23, 2026
ఆయన వల్లే మళ్లీ నాలో మార్పు: సమంత

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తన వివాహ బంధం గురించి హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను విడిపోయినప్పుడు ఇంకొకరిపై ఆధారపడటం సాధ్యమవుతుందని అనుకోలేదు. అదృష్టవశాత్తూ ప్రేమ, స్నేహాన్ని అంగీకరించేంత బలహీనంగా మారిపోయా. నేనున్న రిలేషన్షిప్ వల్ల బెటర్గా మారిపోయా. రాజ్ నిడిమోరు వల్లే ఇది సాధ్యమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో రాజ్, సమంత ఒక్కటయ్యారు.


