News May 27, 2024

పైడితల్లమ్మ దర్శనం టికెట్ ధర పెంపు

image

విజయనగరం పైడితల్లి అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్‌ను ఇటీవల రూ.25 నుంచి రూ.50కు పెంచారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేటు వ్యక్తులు గర్భాలయం పూజలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆలయ అధికారులు కొట్టిపారేశారు. అలా ఏం జరగడం లేదని తేల్చి చెప్పారు.

Similar News

News November 23, 2025

జిల్లాస్థాయి చెకుముఖి పోటీల్లో గర్భాం ఏపీ మోడల్ విద్యార్థులు

image

విజయనగరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముఖి పోటీలు జరిగాయి. గర్భాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చె నెల 12,13,14 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైన్స్ ఎక్స్పో లో పాల్గొంటారని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక మెరకముడిదాం మండల శాఖ ఇన్‌ఛార్జి ఎం.రఘునాథరాజు, నవీన్ అభినందించారు.

News November 23, 2025

VZM: ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం : బొప్పరాజు

image

ఉద్యోగ సంఘాలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని APJAC రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్‌లో జిల్లా APJAC పరిధిలోని సభ్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న బకాయిల సాధనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. APJAC సాధించిన విజయాలను కూడా సమావేశంలో వివరించారు.

News November 23, 2025

VZM: ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం : బొప్పరాజు

image

ఉద్యోగ సంఘాలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని APJAC రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్‌లో జిల్లా APJAC పరిధిలోని సభ్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న బకాయిల సాధనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. APJAC సాధించిన విజయాలను కూడా సమావేశంలో వివరించారు.