News May 27, 2024
పైడితల్లమ్మ దర్శనం టికెట్ ధర పెంపు

విజయనగరం పైడితల్లి అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ను ఇటీవల రూ.25 నుంచి రూ.50కు పెంచారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేటు వ్యక్తులు గర్భాలయం పూజలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆలయ అధికారులు కొట్టిపారేశారు. అలా ఏం జరగడం లేదని తేల్చి చెప్పారు.
Similar News
News December 16, 2025
విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.
News December 16, 2025
VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.
News December 16, 2025
VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.


