News April 2, 2025
పైలెట్ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయండి: జేసీ

వారం రోజుల్లోగా పైలట్ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం మాట్లాడుతూ.. జిల్లాలో 25 పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందన్నారు. గ్రామ సరిహద్దులు నిర్ణయించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి నారద ముని, ఆర్డీవో మధులత పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు.!

స్వచ్ఛ్ భారత్ మిషన్లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
News July 8, 2025
నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?