News April 1, 2025

పొందుర్తిలో రైతు ఆత్మహత్య

image

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 17, 2025

VJA: హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

గుణదల గంగిరెద్దుల దిబ్బలోని సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలను కలెక్టర్ డా. లక్ష్మీశా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తాను కూడా హాస్టల్‌లో ఉండి చదివే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.

News October 17, 2025

KNR: ‘బంద్ ఫర్ జస్టిస్’కు ఏఐఎస్‌ఎఫ్ మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’ తెలంగాణ బంద్‌కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఏఐఎస్‌ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కరీంనగర్‌లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే గవర్నర్, రాష్ట్రపతి చేత ఆమోదింపజేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బంద్ ద్వారానైనా బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆయన కోరారు.

News October 17, 2025

కరీంనగర్‌లో స్వదేశీ ఉత్సవ్ మేళా

image

కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘స్వదేశీ ఉత్సవ్ – క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి ఫెరియా ఫెస్తా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ కె. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.