News January 29, 2025

పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు: SP

image

ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే 2021లో విజయనగరంలోని బొండపల్లిలికి చెందిన చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు నిండితుడిపై పోక్స్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించందని VZM ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు.

Similar News

News November 3, 2025

చిత్తూరు: ఆధార్ అప్‌ డేట్ గడువు పెంపు

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.

News November 3, 2025

పాపికొండల బోటింగ్ షురూ

image

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.

News November 3, 2025

భక్తులారా.. అప్రమత్తంగా ఉండండి.!

image

నేడు కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులు తలకోన, మూలకోన, సదాశివకోన, కోనమల్లేశ్వర స్వామితో పాటు ఇతన కొండాకోనలకు తరలి వెళ్లే అవకాశం ఉంది. మరికొందరు బీచ్‌ల వద్ద పూజలు చేయడానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరారు. తొక్కిసలాటకు తావు లేకుండా నడుచుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.