News January 29, 2025
పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు: SP

ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే 2021లో విజయనగరంలోని బొండపల్లిలికి చెందిన చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు నిండితుడిపై పోక్స్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించందని VZM ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు.
Similar News
News February 13, 2025
రజినీకాంత్పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

రజినీకాంత్పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News February 13, 2025
చేగుంట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.
News February 13, 2025
2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు : SP

దురాజ్ పల్లి గొల్లగట్టు జాతరకు 2వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి 24 గంటల నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.