News January 29, 2025

పొక్సో కేసులో మదనపల్లె యువకులకు రెండేళ్ల శిక్ష

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరిపై నేరం రుజువు కావడంతో చిత్తూరు పొక్సో కోర్టు జడ్జి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ఏపీపీ శైలజ వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన చరణ్, అహ్మద్ ఓ మైనర్ బాలికను 2022లో కిడ్నాప్ చేశారు. అప్పటి 2- టౌన్ పోలీసులు ఇరువురిపై పొక్సో కేసు నమోదు చేశారు. కేసు నడిచి నేరంరుజువైంది. న్యాయమూర్తి శాంతి దోషులకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నేడు తీర్పునిచ్చారు.

Similar News

News October 18, 2025

అఫ్గాన్‌‌‌ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

image

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్‌తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్‌ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.

News October 18, 2025

నిర్మల్: సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ ఏర్పాటు

image

జీవో నంబర్ 317 ప్రకారం తమ సొంత జిల్లా స్థాయి కేడర్‌లో మారి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ కోరే ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే 9000906181 నంబర్‌కు సంప్రదించాలన్నారు. దీంతో సాంకేతిక సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.

News October 18, 2025

యాదాద్రి: అనుకూలిస్తున్న వాతావరణం.. కొనుగోళ్లకు సిద్ధం

image

జిల్లాలో వరుస వానలతో భయపెట్టిన వరుణుడు గత 3 రోజులుగా కాస్త కరుణించాడు. ప్రస్తుతం వాతావరణం రైతులకు అనుకూలంగా ఉంది. ఉదయం పొగమంచు, ఆ తర్వాత ఎండ వస్తుండటంతో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, పత్తిని రైతులు ఎండబెడుతున్నారు. తిరిగి వరి కోతలు ప్రారంభించి, ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కేంద్రాలను సిద్ధం చేయడంతో కొనుగోలు ప్రక్రియ త్వరలో మొదలుకానుంది.