News August 21, 2024
పొగాకు పంటకు పెనాల్టీ రద్దు: ఎంపీ మహేశ్

పొగాకు రైతులు కొందరు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఢిల్లీలో కేంద్ర కామర్స్ మంత్రిని ఎంపీ మహేశ్ ఇటీవల కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీ రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు పెనాల్టీ రద్దు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసిందని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Similar News
News January 9, 2026
ప.గో: మద్యం తాగి దొరికితే రూ.10 వేల జరిమానా!

నరసాపురంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. చలవపేటకు చెందిన ఎన్. శ్రీను మంగళవారం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. నిందితుడిని గురువారం అడిషనల్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ఎదుట హాజరుపరచగా, ఆమె రూ.10 వేల అపరాధ రుసుము విధించినట్లు టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆమె హెచ్చరించారు.
News January 9, 2026
పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
News January 9, 2026
పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


