News August 31, 2024

పొదలకూరు: నిమ్మ కిలో రూ.120

image

జిల్లాలో నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్లో శుక్రవారం కిలో రూ.110 నుంచి రూ.120వరకు ధర పలికింది. ఈ మార్కెట్‌కు కలువాయి, చేజర్ల, రాపూరు, మనుబోలు, సైదాపురం మండలాల నుంచి కాయలు వస్తుంటాయి. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో వచ్చిన తక్కువ దిగుబడికి శ్రావణమాసం, వినాయకచవితి పండగల నేపథ్యంలో గిరాకీ పెరిగింది. మరో 3నెలలు నిమ్మ ధరలు ఇలాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News January 8, 2026

NLR: వృద్ధాశ్రమాలకు అనుమతులు ఉండాల్సిందే..!

image

నెల్లూరు జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు అహ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు లేని వయోవృద్ధుల ఆశ్రమాలపై 2007 వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News January 8, 2026

కోడి పందేలు జరగకుండా చూడాలి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో జిల్లా జంతు హింస నివారణ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి, ఎడ్ల పందేలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు.

News January 8, 2026

నెల్లూరు: బంగారం కోసం హత్య

image

కొడవలూరు (M) కొత్త వంగల్లు గ్రామంలో ఈనెల 5న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ కోటేశ్వరమ్మ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల వెల్లడించారు. కోటేశ్వరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వేముల రంజిత్ కుమార్ రాయితో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు సరుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుడు రికవరీ చేశారు.