News January 30, 2025

పొదిలి: చెల్లిని హత్య చేసిన కేసులో అన్నకు రిమాండ్.!

image

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లెలిని సొంత అన్నే హత్య చేసిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు బుధవారం అన్నారు. పునుగోడుకు చెందిన సంధ్యను అన్న అశోక్ గత ఏడాది ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశోక్ కుమార్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

Similar News

News October 26, 2025

ప్రకాశం: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి

image

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిలా కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కొండపి మండలంలో జరిగింది. తండ్రి మద్యం మత్తులో 12 ఏళ్ల కుమార్తెపై కొద్దిరోజుల క్రితం అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఈ విషయం తేలింది. దీంతో తల్లి బాలికను ఆరా తీయగా కన్నతండ్రే కాలయముడయ్యాడని తెలిపింది. కాగా కొండపి PSలో పోక్సో కేసు నమోదైంది.

News October 26, 2025

రేపు ఎస్పీ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో 27న నిర్వహించవలసిన PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.

News October 26, 2025

ప్రకాశం: తుఫాన్.. 3 రోజులు స్కూల్స్‌కు సెలవులు!

image

ప్రకాశం జిల్లాకు ముంథా తుఫాన్ కారణంగా 27, 28, 29 తేదీల్లో 3 రోజులపాటు అన్ని పాఠశాలలకు కలెక్టర్ రాజాబాబు సెలవులు ప్రకటించారు. తుఫాన్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.