News August 27, 2024
పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ముస్తాబాద్ పర్యటనలు రద్దు

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ముస్తాబాద్ పర్యటనలు రద్దైనట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హనుమకొండ జిల్లాలో ఉండటంతో గవర్నర్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అన్నారు.
Similar News
News October 25, 2025
KNR: పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పీటీసీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కళాశాల అధికారులను సీపీ అభినందించారు.
News October 25, 2025
హుజురాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని HZB డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును NOV 3న నడుపుతున్నట్లు DM రవీంద్రనాథ్ తెలిపారు. NOV 3న బయలుదేరిన బస్సు KNR, HYD మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్కు వెళ్తుంది. NOV 4న అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణ అనంతరం 5న తిరిగి ప్రయాణమై, 6న జోగులాంబ మీదుగా HZB చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు రూ.4,600, పిల్లలకు రూ.3,500. వివరాలకు డిపో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
News October 25, 2025
KNR జిల్లాలో 16 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీ

జిల్లా జనరల్ ఆసుపత్రిలో రెండు రోజులపాటు నిర్వహించిన గుండె వ్యాధి నిర్ధారణ శిబిరంలో 16 మంది చిన్నపిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమని గుర్తించినట్లు జిల్లా ఇమ్యూనైజన్ (డీఐవో) అధికారి డాక్టర్ సాజిద్ తెలిపారు. అపోలో ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 153 మంది పిల్లలు పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 23 మందికి చికిత్స అవసరమని, 14మందికి రివ్యూ నిర్వహించనున్నట్లు డీఐవో డాక్టర్ సాజిద్ తెలిపారు.


