News November 15, 2024
పొన్నలూరు క్రీడాకారిణి మైథిలి మరణం.. కేసు

పొన్నలూరు మండలానికి చెందిన క్రీడాకారిణి మైథిలి గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే బాలిక మృతికి జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ వనజ, పీఈటి బన్నీ, కృపాకర్ కారణం అంటూ కొద్దిరోజులుగా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. పోటీలు జరిగిన తర్వాత తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చలేదని పవన్ కళ్యాణ్ని కలసి వివరించారు. దీంతో గురువారం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.
News February 23, 2026
మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.
News February 23, 2026
మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.


