News December 3, 2024

పొన్నలూరు: తల్లితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

image

గతనెల 23న HYDలో పొన్నలూరు(M) చెరుకూరు వాసి మార్క్(26) హత్యకు గురయ్యాడు. అతడు HYDలో నివాసం ఉంటూ సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. మార్క్ స్వగ్రామం చెరుకూరుకు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా భార్య లేదు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య, ఆమె తల్లి లక్ష్మి, తల్లితో సహజీవనం ఉంటున్న కాశీనాథ్ కలిసి మార్క్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News November 30, 2025

తుఫాను ప్రభావం పడే 14 మండలాలు ఇవే.!

image

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.