News December 3, 2024
పొన్నలూరు: తల్లితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

గతనెల 23న HYDలో పొన్నలూరు(M) చెరుకూరు వాసి మార్క్(26) హత్యకు గురయ్యాడు. అతడు HYDలో నివాసం ఉంటూ సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. మార్క్ స్వగ్రామం చెరుకూరుకు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా భార్య లేదు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య, ఆమె తల్లి లక్ష్మి, తల్లితో సహజీవనం ఉంటున్న కాశీనాథ్ కలిసి మార్క్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 23, 2026
ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.
News January 23, 2026
ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
News January 23, 2026
జగన్ పాలనలో అన్ని వర్గాలకూ వేధింపులే: మంత్రి స్వామి

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్రెడ్డి సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ వేధించారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అమరావతి, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీరుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన ధ్వజమెత్తారు.


