News January 31, 2025

పొలం పనుల్లో రఘువీరారెడ్డి

image

మంత్రి, పీసీసీ చీఫ్‌గా పనిచేసి ప్రజలందరికీ సుపరిచితులైన రఘువీరారెడ్డి పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని తన పొలంలో రైతుగా మారారు. పంటలోని కలుపు మొక్కలను యంత్రంతో స్వయంగా తొలగించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయం దొరికినప్పుడు సామాన్యుడిలా  జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సాగించారు.

Similar News

News October 22, 2025

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

image

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్‌స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

కామారెడ్డి జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

image

కామారెడ్డి జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి మహేష్ కుమార్ తెలిపారు. హన్మాజీపేట, పుల్కల్, పిట్లం, అంతంపల్లి, బస్వాపూర్, పెద్ద కొడప్‌గల్, సోమార్‌పేట, రాజంపేట, ఆర్గొండ, కొండాపూర్, ముథోలి, గాంధారి భూంపల్లి, దుర్గం, తాడ్వాయి, దేమికలాన్ వంటి గ్రామాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర చెల్లిస్తామన్నారు.

News October 22, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీలను స్మరిస్తూ ఫ్లెక్సీలు

image

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాన కూడళ్లు, పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్న ఫొటోతో రూపొందించిన ఈ ఫ్లెక్సీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.