News January 28, 2025

పోక్సో కేసుల్లో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలి: ASF SP

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులు త్వరగతిన పూర్తి చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 21, 2025

కురిచేడు: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన

image

కురిచేడు మండలం కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

News November 21, 2025

MLA ఉత్తమ్ పద్మావతి గారూ.. 152 మంది రైతుల అవస్థలు తీరేనా?

image

సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామ వైకుంఠధామం నుంచి గండ్ల చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్ల డొంక మార్గం అస్తవ్యస్తంగా ఉండటంతో 152 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రైతులు, పశువులు అలుగు నీటిలో నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చెరువు వద్ద తక్షణమే కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి, రాకపోకల ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని రైతులు కోరుతున్నారు.