News February 4, 2025
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: KMR ఎస్పీ
విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆమె పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News February 5, 2025
నిర్మల్ వైద్య కళాశాలలో JOBSపై UPDATE
నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో 52 ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా కళాశాల నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంటుందని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అధ్యక్సఉడు దుర్గం శేఖర్ తెలిపారు. ఈనెల 5 నుంచి 8 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
News February 5, 2025
వరల్డ్ రికార్డుపై షమీ కన్ను
రేపు ENGతో జరిగే తొలి వన్డేలో IND పేసర్ షమీ ప్రపంచ రికార్డుపై గురిపెట్టారు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీస్తే ODIలలో అత్యంత వేగంగా 200వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తారు. ప్రస్తుతం షమీ 100 మ్యాచ్లలో 195 వికెట్లు తీశారు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ టాప్లో ఉన్నారు. అతను 102 మ్యాచ్లలో 200W కూల్చారు. ఆ తర్వాత ముస్తాక్-PAK(104M), ట్రెంట్ బౌల్ట్-NZ(107M), బ్రెట్ లీ-AUS(112M), డొనాల్డ్-SA(117M) ఉన్నారు.
News February 5, 2025
ఆ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి: KMR కలెక్టర్
గడువులోగా CMR పూర్తి చేయకుండా ఉదాసీనత ప్రదర్శించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోగా 100% CMR పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి ప్రతి రోజు మిల్లులను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే రబీ వరి ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.