News February 4, 2025
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: KMR ఎస్పీ

విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆమె పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News January 7, 2026
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా రామాంజనమ్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా లేపాక్షి మండలానికి చెందిన రామాంజనమ్మను TDP అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు అందాయి. రామాంజనమ్మ మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత. కాగా, ఆమె ZPTCగా కూడా పనిచేశారు. ఇటీవల TDPలో రాష్ట్ర మహిళా కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలను గుర్తించిన అధిష్ఠానం రామాంజనమ్మను ఏసీసీ కమిషన్ సభ్యురాలుగా ఎంపిక చేసింది.
News January 7, 2026
రక్తమే రంగుగా.. జగన్ చిత్రపటం గీసిన అభిమాని!

ధవళేశ్వరానికి చెందిన కళాకారుడు మిరప రమేష్ను మాజీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా రమేష్ తన రక్తంతో ఆయన చిత్రపటాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు చొరవతో తాడేపల్లిలో జగన్ను కలిసిన రమేష్.. తాను గీసిన చిత్రాన్ని స్వయంగా చూపించారు. యువకుడి ప్రతిభను, అభిమానాన్ని చూసి ముచ్చటపడ్డ జగన్.. అతడిని ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు.
News January 7, 2026
మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో కానున్న నాగార్జున!

రా కార్తీక్ డైరెక్షన్లో సినీ హీరో నాగార్జున 100వ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీని నాగార్జునకు కలిసొచ్చిన డేట్ మే 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘విక్రమ్’, ‘మనం’ ఇదే తేదీన రిలీజై విక్టరీ కొట్టాయి. తాజా సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్ను ఫాలో కానున్నారని టాక్. ఈ చిత్రానికి ‘100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


