News February 4, 2025
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: KMR ఎస్పీ

విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆమె పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News October 27, 2025
92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక

కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు.
News October 27, 2025
జూబ్లీహిల్స్లో ఎవరి పంతం నెగ్గుతుందో..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయమే కాదు PJR పిల్లల మధ్య కూడా నువ్వానేనా అన్నట్లుగా మారింది. స్థానిక ప్రజలకు PJR అంటే ఎనలేని అభిమానం. కాగా ఆయన కుమారుడు, మాజీ MLA విష్ణువర్ధన్ రెడ్డి BRSలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనని అంటున్నారు. PJR కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. BRSను ఓడగొడతామంటున్నారు. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.
News October 27, 2025
VKB: ధాన్యం, పత్తి కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

పత్తి, వరి ధాన్యం కొనుగోలను రైతులకు ఇబ్బంది కలగకుండా సరైన విధంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు రైస్ మిల్లర్లకు ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పత్తి, వరి ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.


