News January 24, 2025
పోచంపల్లిలో కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ అశోక్ కుమార్ జైస్వాల్ పర్యటించారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమలు, చేనేత షాపులను పరిశీలించారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను అందజేస్తుందని తెలిపారు.
Similar News
News November 14, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 14, 2025
వేములవాడ రాజన్న దర్శనాలు.. UPDATE

వేములవాడ రాజన్న ఆలయంలో రెండు రోజుల క్రితం నుంచి దర్శనాలను నిలిపివేసిన అధికారులు భక్తులు ప్రవేశించకుండా ముందు భాగంలోని స్వాగత ద్వారం వద్ద రేకులను అమర్చిన విషయం తెలిసిందే. తాజాగా గేటు బయట నుంచి సైతం మరింత ఎత్తుగా అదనంగా రేకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గేటు ముందు రెండంచెల భద్రత తరహాలో ఇనుప రేకులను ఫిక్స్ చేశారు.
News November 14, 2025
అన్నమయ్య: బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

అన్నమయ్య జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న వినాయక ట్రావెల్ బస్సు చిన్నమండ్యం, కేశాపురంలో ఓ బైక్, ఫారెస్ట్ చెక్పోస్టును ఢీ కొట్టింది. దానిని వెనుకే వస్తున్న బెంగళూరు-పొరుమామిళ్ల ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై మదనపల్లె సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు విచారిస్తున్నారు.


