News June 16, 2024
పోచంపల్లి అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో 27 మంది

పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జనరల్ స్థానoలో 11 మంది, మహిళ కేటగిరిలో ముగ్గురు , ఎస్సీ కేటగిరిలో ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా రెండు మహిళల స్థానానికి ముగ్గురు అభ్యర్థులు , ఒక ఎస్సీ స్థానానికి ఇద్దరు , ఆరు జనరల్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.
Similar News
News October 25, 2025
అక్టోబర్ 30 నుంచి టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు: డీఈఓ

మార్చి 2026లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు వివరాలను డీఈఓ బొల్లారం భిక్షపతి వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ. 110 చొప్పున అక్టోబరు 30 నుంచి నవంబరు 13వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 29, రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500ల అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News October 24, 2025
పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.
News October 24, 2025
ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


