News April 10, 2025

పోచంపల్లి: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ 

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ రిపేరింగ్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ – మెయింటెనెన్స్ , హౌస్ వైరింగ్, జర్దోజి(అడ్వాన్సుడ్) శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Similar News

News October 26, 2025

ఐటీ కారిడార్‌‌పై ఆర్టీసీ ఫోకస్

image

ఐటీ కారిడార్‌పై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 82 లక్షల వాహనాలు తిరుగుతుండగా వాటిలో ఐటీ కారిడార్ వైపు ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనపు బస్సులు, సౌకర్యవంతమైన సర్వీసులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రాఫిక్ తగ్గించడంతో పాటు, ప్రయాణికులకు సులభతరం కల్పించే చర్యలు చేపట్టనున్నారు.

News October 26, 2025

HMDA పునర్వ్యవస్థీకరణ..జోనింగ్ పై FOCUS

image

HYD మహానగర అభివృద్ధి సంస్థ HMDA పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. నగర పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు RRR వరకు విస్తరించిన పరిధిలో ఘట్‌కేసర్, శంషాబాద్, శంకరపల్లి 1-2, మేడ్చల్ 1-2 జోన్లను విభజించి, ప్రతి జోన్‌లో ప్రత్యేక అధికారులు, సాంకేతిక సిబ్బందిని నియమించే అవకాశముంది. ముఖ్యంగా జోనింగ్ పై ఫోకస్ పెట్టింది.

News October 26, 2025

పల్నాడులో రేపు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

image

అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 27 తేదీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ‘మెంథా’ తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.