News March 3, 2025
పోచంపల్లి: మద్యం విక్రయిస్తే రూ.25 వేలు ఫైన్..

మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు ఉండకూడదని అందరూ ప్రతిజ్ఞ చేశారు. మద్యం విక్రయిస్తే రూ. 25 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ. 5 వేలు బహుమానమని ప్రకటించారు. బెల్ట్ షాపులను గ్రామస్తులు నిషేధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
అమరావతిలో ‘అంతిమ యాత్ర’ చిక్కులు

అమరావతి నిర్మాణంలో ‘శ్మశాన వాటికల’ ఏర్పాటు కొత్త సవాలుగా మారింది. ‘మన గ్రామం-మన శ్మశానం’ అనే సెంటిమెంట్ బలంగా ఉండటంతో, రైతులు గ్రామాల వారీగా శ్మశానాలు కోరుతున్నారు. రాజధాని అభివృద్ధిలో పాత దారులు మూసుకుపోవడంతో సమస్య జఠిలమైంది. హిందూ, ముస్లిం, దళితుల సంప్రదాయాలను గౌరవిస్తూ, హైబ్రిడ్ మోడల్లో 3-4గ్రామాలకు ఒక క్లస్టర్, లేదా కృష్ణా నది ఒడ్డున ఉమ్మడి శ్మశానాల ఏర్పాటుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
News December 4, 2025
నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఆస్తా పూనియా

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.
News December 4, 2025
సిద్దిపేట: ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ సమావేశం

సిద్దిపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని లాబ్ టెక్నిషియన్స్ నెలవారి సమీక్ష సమావేశం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా HOSPITALలలో పేషంట్స్కి నిర్వహించే పరీక్షలలో ఎలాంటి అలసత్వాన్ని లేకుండా నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని ఆదేశించారు.


