News March 26, 2025

పోరాటయోధుడు ధర్మభిక్షం

image

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి

Similar News

News October 19, 2025

కరీంనగర్: కానిస్టేబుల్‌ నుంచి డిప్యూటీ MRO వరకు

image

కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తోకల శైలుకిరణ్ తాజాగా విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరచి డిప్యూటీ MROగా ఎంపికయ్యారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కష్టపడి చదువుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రిపరేషన్ సమయంలో తండ్రి మరణించినా ధైర్యంగా చదువును కొనసాగించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రం అందుకున్నారు.

News October 19, 2025

WGL: ఆసక్తి గలవారు వేసేశారు.. మిగిలింది ఎవరు.?

image

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మద్యం వ్యాపారులు, కొత్తగా చేయాలనే వారు టెండర్ వేసేశారు. ఇక మిగిలింది ఎవరనే ప్రశ్న మొదలైంది. లైసెన్స్ దక్కించున్నాక వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్ని కావని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.3 లక్షల ఫీజు చేసింది. ఏడాది ఫీజులో నగరాలకు రూ.10 లక్షలకు పెంచింది. ఇక ఏడాదికి రూరల్‌కు రూ.5.50 కోట్లు, అర్బన్‌కు రూ.8.50 కోట్లు అమ్మితే 20 శాతం కోటా పూర్తయితే 10 శాతం కమీషన్ ఇస్తారు.

News October 19, 2025

రూ.కోటికి పైగా మోసపోయిన మైదుకూరు MLA..?

image

కడప జిల్లా మైదుకూరు MLA పుట్టా సుధాకర్‌ సైబర్ మోసానికి గురైనట్లు BBC సహా పలు పత్రికలు పేర్కొన్నాయి. ఆ కథనాల మేరకు.. ఈనెల 10వ తేదీ సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బెదిరించారు. వీడియో కాల్ చేసి డిజిటిల్ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఎమ్మెల్యే 15వ తేదీ వరకు వివిధ దఫాలుగా రూ.1.07 కోట్లు పంపారు. కేసు క్లియరెన్స్‌కు మరికొంత అడగడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.