News March 26, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి
Similar News
News November 13, 2025
ప్రేమ అర్థాన్ని కోల్పోయింది: అజయ్ దేవగణ్

ప్రేమ అర్థాన్ని కోల్పోయిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అన్నారు. ‘ప్రేమ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని డెప్త్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మెసేజ్కు హార్ట్ ఎమోజీ పెడుతున్నారు. అన్ని మెసేజ్లు లవ్తో ముగుస్తున్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలని అజయ్ భార్య <<18269284>>కాజోల్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం గమనార్హం.
News November 13, 2025
NZB: ప్రజాధనాన్ని గోదావరిలో కలిపిన ఘనత కేసీఆర్దే: మహేష్ గౌడ్

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గురువారం నిజామాబాద్లో నిర్వహించిన సుదర్శన్ రెడ్డి అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాధనాన్ని కాళేశ్వరం పేరుతో గోదావరిలో పోసిన ఘనత కేసీఆర్దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ మాట నిలబెట్టుకుందన్నారు.
News November 13, 2025
NZB: ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదు.. జిల్లాకు మంత్రి: టీపీసీసీ చీఫ్

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే కాదని జిల్లాకు వాస్తవిక మంత్రి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్స్లో సుదర్శన్ రెడ్డికి నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనుభవం, ఆలోచన, అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి పెద్దన్న లాంటి వారన్నారు.


