News January 11, 2025

పోరాట వీరుడు!

image

నేడు వడ్డే ఓబన్న జయంతి. ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు. ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓబన్న సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారు. నరసింహారెడ్డి తాతది ఇదే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకూ సంబంధాలు ఉండేవి. 1846 అక్టోబరు 6న బ్రిటిష్‌ వారితో పోరాటంలో ఓబన్న 39ఏళ్లకే వీరమరణం పొందారు. ఆ తర్వాత నరసింహారెడ్డిని ఉరితీశారు.

Similar News

News February 22, 2026

కర్నూలు: ”సీమను’ ఎడారిని చేసేందుకు చంద్రబాబు కుట్ర’

image

రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి, ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తిరుమల వివాదం వల్ల వెంకన్న శాపంతో హెరిటేజ్ సంస్థకు రూ.2,770 కోట్ల నష్టం వాటిల్లిందని, షేర్ల విలువ భారీగా పడిపోయిందని ఆయన విమర్శించారు.

News February 22, 2026

ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

image

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News February 22, 2026

కర్నూలు జిల్లా ప్రజలకు గమనిక!

image

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో సమర్పించిన ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.