News March 10, 2025
పోర్టు పనుల్లో కందుకూరు MLA దందా..?

కందుకూరు టీడీపీ MLA ఇంటూరి నాగేశ్వర రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ‘రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కావాలని MLA కోరగా కాంట్రాక్టర్ ఇవ్వలేదు. పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీకి వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో ఆ వాహనాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం ఆఫీసుకు చేరినా ఎమ్మెల్యే దందా ఆపడం లేదు’ అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.
Similar News
News November 12, 2025
జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తి: ప్రకాశం కలెక్టర్

జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని కలెక్టర్ రాజా బాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గృహాల నిర్మాణం ద్వారా రూ. 17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం లబ్ధిదారులకు మేలు జరిగిందన్నారు. వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మందికి రూ.18.36 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.
News November 12, 2025
తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసి మృతి

ప్రకాశం జిల్లా వాసి జగిత్యాల జిల్లాలో మృతి చెందిన ఘటన మంగళవారం జరింగింది. జిల్లాలోని బీర్పూర్ (M) చిన్నకొల్వాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ బావిలో పడి వలస కూలీ మృతి చెందాడు. కాగా మృతుడు ప్రకాశం జిల్లా కలికివాయ బిట్రగుంటకి చెందిన రామకృష్ణ(52)గా గుర్తించారు. ఇతనితోపాటు మరికొంతమంది బావిలో ఇసుక పూడిక తీస్తుండగా రామకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో మృతి చెందాడు. కాగా బీర్పూర్ SI, పరిశీలించి కేసు నమోదు చేశారు.
News November 11, 2025
ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఉండవల్లికి బయలుదేరారు.


