News March 6, 2025

పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు: షర్మిల

image

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రచారం అవాస్తవం అయితే కేంద్రంతో ప్రకటన చేపించాలని ప్రభుత్వాన్ని YS షర్మిల డిమాండ్ చేశారు. ‘పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు. ఈ ప్రాజెక్టు పేరు వింటే YSR గుర్తుకొచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? నాడు తట్టెడు మట్టి అయినా తీశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకుంది మీరు కాదా?’ అని ఆమె Xలో నిలదీశారు.

Similar News

News December 8, 2025

ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

image

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.

News December 8, 2025

ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

image

అమెరికాలోని బర్మింగ్ హామ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.

News December 8, 2025

ప.గో: బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

image

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.