News March 22, 2024
పోలవరం: చివరికి ఆ సీటు ఎవరికి..?

ఉమ్మడి ప.గో. జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే సీటు కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొంది. కొంతకాలం వరకు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ ఇస్తున్నారని, అలాగే టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసులకు సీటు కేటాయిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలలో కొత్త అభ్యర్థుల పేర్లు వినిపించడంతో టీడీపీ, జనసేన నాయకుల్లో టెన్షన్ నెలకొంది.
Similar News
News November 13, 2025
భీమవరంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

భీమవరం (M) కొవ్వాడలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్కు చెందిన హేమవర్షిని (22) భీమవరంలో బీడీఎస్ చదువుతుంది. మంగళవారం తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయలేదు. స్నేహితులు కొవ్వాడలో ఇంటికి వెళ్లికి చూడగా ఉరివేసుకున్నట్లు గుర్తించి తండ్రి సింహాచలం, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
జిల్లాలో వందే భారత్.. నరసాపురం వరకు పొడిగింపు

జిల్లాలో మొట్ట మొదటిగా వందే భారత్ రైలు నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 12 నుంచి నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 20677 రైలు చెన్నై నుంచి జనవరి 12న 5.30 బయలుదేరి 14.10కి నరసాపురం చేరుతుంది. తిరిగి అదే రోజు నరసాపురంలో 14.50 బయలుదేరి 23.45కు చెన్నై చేరుతుంది. జిల్లాలో ఈ రైలు భీమవరం, నరసాపురంలో ఆగుతుంది.
News November 13, 2025
అప్సడా రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1.33 లక్షల ఎకరాల ఆక్వా సాగు జరుగుతుండగా, కేవలం 60 వేల ఎకరాలు మాత్రమే అప్సడాలో రిజిస్ట్రేషన్ అయ్యాయని సమీక్షలో గుర్తించారు. మిగిలిన ఆక్వా సాగు ప్రాంతాన్ని కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు.


