News July 9, 2024
పోలాండ్లో సత్తా చాటిన విజయవాడ అమ్మాయి

విజయవాడకు చెందిన అనూష భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మూడు పతకాలు కైవసం చేసుకున్నట్లు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ తెలిపారు. జులై 5 నుంచి 8 వరకు పోలాండ్లో జరిగిన 17వ పోలాండ్ కప్ అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అనూషను అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
Similar News
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.
News November 28, 2025
కృష్ణా జిల్లాకు దిత్వా తుఫాన్ హెచ్చరిక.!

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా కృష్ణా జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్కు, దిత్వా తుఫాన్కు కొంత తేడా ఉంటుందని, మొంథా తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలులు దిత్వా తుఫాన్ కారణంగా ఉండవన్నారు. కేవలం అధిక వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News November 28, 2025
తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రానున్న దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీ.కే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఆయన తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలపై శుక్రవారం సమీక్షించారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అప్రమత్తం చేసి కోసిన ధాన్యం తడిచి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.


