News February 17, 2025
పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం: కలెక్టర్

ఫిబ్రవరి 27న ఉమ్మడి కృష్ణా-గుంటూరు శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
ఈనెల 27 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం

ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని ఈనెల 27న పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈఓ NVSN మూర్తి తెలిపారు. కరోనా సమయంలో అధికారులు అంతరాలయ దర్శనాన్ని, అలాగే ముఖ మండపం లోంచి స్వామి, అమ్మవార్ల దర్శనాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి భక్తులు బయట నుంచే స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్నారు. అయితే ఈనెల 27 నుంచి పాత పద్ధతిలో దర్శనాలను పునరుద్ధరిస్తున్నారు. దర్శనం టికెట్ రూ.500గా నిర్ణయించారు.
News November 13, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.inలో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.
News November 13, 2025
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.


