News March 18, 2025

పోలింగ్ కేంద్రాల విభజనపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

image

ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 లకు మించి ఓటర్లు ఉండరాదనే నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

NGKL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలి: ఎంపీ

image

పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యువత ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు.

News November 21, 2025

వీరుల గుడిలో పల్నాడు ఎస్పీ ప్రత్యేక పూజలు

image

కారంపూడి వీరుల ఉత్సవాల సందర్భంగా పల్నాడు ఎస్పీ రామకృష్ణారావు శుక్రవారం వీరుల గుడిని సందర్శించారు. పల్నాడు యుద్ధంలో వీరులు వాడిన కొణతాల గురించి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవులును అడిగి తెలుసుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పల్నాటి వీరుల ఉత్సవాల గురించి ఎస్పీకి వివరించారు.

News November 21, 2025

జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

image

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్‌వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.