News March 18, 2025

పోలింగ్ కేంద్రాల విభజనపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

image

ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 లకు మించి ఓటర్లు ఉండరాదనే నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News November 18, 2025

VKB: ‘డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’

image

యువత డ్రగ్స్ మహమ్మారిన పడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణ కుమారి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థి దశలో డ్రగ్స్‌కు అలవాటు పడితే పూర్తిగా జీవితం చిన్న భిన్నం అవుతుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.

News November 18, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

News November 18, 2025

రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <>annadathasukhibhava.ap.gov.in<<>> ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్‌కి వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.