News March 18, 2025
పోలింగ్ కేంద్రాల విభజనపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో బాపట్ల కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 లకు మించి ఓటర్లు ఉండరాదనే నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News September 15, 2025
ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.
News September 15, 2025
KNR: రాజీవ్ యువ వికాసం.. దసరాకైనా అందేనా..?

రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి పొందవచ్చని భావించిన ఉమ్మడి KNR జిల్లా నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి. జూన్ 2న రూ.50వేల నుంచి రూ.లక్షలోపు దరఖాస్తు చేసుకున్న అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి చివరి నిమిషంలో నిలిపేసింది. AUG 15న వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే ఎదురైంది. ఈ దసరాకైనా వస్తాయని ఆశతో ఎదురుచూస్తోంది. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1,71,116 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
News September 15, 2025
HYD: నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష

నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.