News February 25, 2025

పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి: ADB కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండో విడత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే  ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News November 25, 2025

ADB: 2వ బెటాలియన్ కమాండెంట్‌గా వెంకట్రాములు

image

ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడలోని 2వ బెటాలియన్ కమాండెంట్‌గా వెంకట్రాములు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సీనియర్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. దళాల శిక్షణ, క్రమశిక్షణ, ప్రజా బాధ్యతపై మొదటి ప్రధాన్యత ఉంటుందన్నారు. బెటాలియన్ ప్రతిష్టను మరింతగా పెంచేలా సమష్టిగా పనిచేస్తామని ఆయన అన్నారు.

News November 25, 2025

ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సూచన

image

సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, పత్తి పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం, భూసార, జీవవైవిధ్య నష్టం, భూమిలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి సమస్యలు ఏర్పడతాయని DAO శ్రీధర్ తెలిపారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను లేదా పంట అవశేషాలను కాల్చకుండా వాటిని కంపోస్ట్, వర్మీ కంపోస్ట్‌గా మార్చి లేదా భూమిలో కలియదున్నాలని, వ్యవసాయంలో సేంద్రియ ఎరువులుగా వినియోగించుకోవాలన్నారు. భూసారాన్ని సంరక్షించాలని అన్నారు

News November 25, 2025

ADB: ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

image

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న ఎస్బీఐకి చెందిన రెండు ఏటీఎంలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ఏటీఎంలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఏపీ ప్రకాశం జిల్లా చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.