News March 24, 2025

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి: ఎస్పీ కిరణ్ ఖరే 

image

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్‌లో 21 మంది ఆర్జీదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News January 7, 2026

నల్గొండ మున్సిపాలిటీది ఘనచరిత్ర

image

నల్గొండ మున్సిపాలిటీకి ఘనచరిత్రే ఉన్నది. నల్గొండను 1951లో 12 వార్డులతో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం.. పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2గా.. 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1గా అప్ గ్రేడ్ చేశారు. 2018లో గ్రేడ్ 1గా ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 2.5 లక్షల మేర జనాభా ఉన్నది.

News January 7, 2026

‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

image

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

News January 7, 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పాలమూరు వాసుల మృతి

image

ఉజ్జయిని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నచింతకుంట మండలం పర్దిపూర్‌కు చెందిన కావలి నరసింహులు(28), కురువ శివకుమార్(24) దుర్మరణం చెందారు. దైవదర్శనం ముగించుకుని వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన డ్రైవర్‌ కూడా మృతి చెందారు. గాయపడిన వారు నేడు గ్రామానికి చేరుకోనుండగా, పర్దిపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.