News March 24, 2025

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి: ఎస్పీ కిరణ్ ఖరే 

image

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్‌లో 21 మంది ఆర్జీదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News November 12, 2025

MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.

News November 12, 2025

వనపర్తి: నవంబర్ 14 నుంచి ‘మిషన్ మధుమేహ-దృష్టి’

image

డయాబెటిస్ రోగులు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభంలోనే సమస్యలను గుర్తిస్తే నివారించవచ్చని వనపర్తి ఇన్‌చార్జి DMHO సాయినాథ్ రెడ్డి అన్నారు. NOV 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని డయాబెటిస్ రోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ‘మిషన్ మధుమేహ-దృష్టి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను మంగళవారం DMHO కార్యాలయంలో నిర్వహించారు.

News November 12, 2025

జగిత్యాల: కిక్ బాక్సింగ్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025- 26 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజ గౌడ్, DRDO రఘువరన్ పాల్గొన్నారు.