News April 10, 2025
పోలీసుల అదుపులో ఐటీడీపీ కార్యకర్త కిరణ్

YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ను అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 11, 2025
మేడ్చల్: ‘రేషన్ కార్డులకు E-KYC పూర్తి చేయాలి’

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.
News July 11, 2025
NLG: వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ కలకలం

ఉమ్మడి నల్గొండలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. DCMS మాజీ ఛైర్మన్ వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈనెల 14న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో జిల్లాలో పలువురు నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు వచ్చినా, ఇది అధికారులిచ్చిన తొలి నోటీసు కావడం గమనార్హం. జిల్లాలో ఇంకెంత మంది నేతలు ట్యాపింగ్ బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.
News July 11, 2025
కాకినాడతో నాకు ఎంతో అనుబంధం: నటుడు సుమన్

కాకినాడ రూరల్ వలస పాకలలో సాయిబాబా గుడి వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సినీ హీరో నటుడు సుమన్ పాల్గొన్నారు. జనసేన యువ నాయకుడు పంతం సందీప్ హీరో సుమన్ ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. సుమన్ మాట్లాడుతూ.. కాకినాడ తో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.