News October 25, 2024

పోలీసు అధికారులతో కడప ఎస్పీ సమావేశం

image

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు తక్షణం స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను ఆదేశించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల విక్రాయలపై నిఘా ఉంచి దాడులు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా టపాసుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News October 25, 2025

రాజుపాలెం: కుందూనదిలో దంపతుల ఆత్మహత్యాయత్నం?

image

రాజుపాలెం మండలంలోని వెళ్లాల సమీపంలోని కుందూ నదిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యాభర్తలు గొంగటి రామసుబ్బారెడ్డి, నాగ మునెమ్మ పడ్డారు. గమనించిన స్థానికులు నదిలో కొట్టుకుపోతున్న భర్తను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నాగ మునెమ్మ గల్లంతయారు. ఆమె కోసం గజఈత గాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. వీరు పెద్దముడియం మండలంలోని ఉప్పులూరుకు చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 25, 2025

కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

image

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News October 25, 2025

కడప జాయింట్ కలెక్టర్‌కు మరో బాధ్యత

image

కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కుడా) వైస్ ఛైర్మన్‌గా జేసీ అతిథి సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. కడప జిల్లాకు జేసీ అతిథి పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.