News December 24, 2024

పోలీసు అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

image

హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీస్ అధికారులను మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. అనంతరం పోలీస్ అధికారులకు సీపీ రివార్డులను అందజేశారు. 2019 SEP 10న పెనుబల్లి పోలీస్ స్టేషన్ పరిధి బ్రహ్మాళకుంటలో హత్య జరిగింది. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా, ఒకరికి ఐదేళ్ల జైలుశిక్ష రూ.5వేల జరిమానా పడేలా పోలీస్ అధికారులు కృషి చేశారని సీపీ పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

వెలుగుమట్లలో బాధితులపై సర్వే కొనసాగుతోంది: కలెక్టర్

image

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక-ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోందని అనుదీప్ దురిశెట్టి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన 522 మంది, ఇతర జిల్లాలకు 107, ఇతర రాష్ట్రాలకు ముగ్గురిని గుర్తించారు. సర్వే పూర్తయ్యాక అర్హులకు నివాస స్థలం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సంబంధితులు సర్వేకు సహకరించాలని కోరారు.

News February 28, 2026

ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

image

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.

News February 28, 2026

ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

image

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.