News July 30, 2024

పోలీస్ కమిషనర్ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా!

image

వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు. ఫ్రెండ్స్ రిక్వెస్టు పంపిస్తున్నారు. దీన్ని ఎవరూ అనుమతించవద్దని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ ఫేస్‌బుక్ ఐడీలు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News January 8, 2026

WGL: సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్లు!

image

జిల్లాలో సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్ల మేర ఉన్నాయి. 15,311 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయగా, మరో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎస్ఎస్పీ కింద రూ.346.3 కోట్లను రైతులకు చెల్లించగా, మరో రూ.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. సన్న వడ్ల బోనస్ కింద రూ.75.2 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.21.2 కోట్లను మాత్రము ప్రభుత్వం చెల్లించింది.

News January 7, 2026

జూనియర్ కాలేజీలకు డిజిటల్ టీవీలు: వరంగల్ DIEO

image

వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ బోధనకు ఉపకరించే సామాగ్రి అందించినట్లు వెల్లడించారు. నేడు గీసుకొండ కళాశాలకు అందించామన్నారు. ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా విలువైన డిజిటల్ సామాగ్రి పంపిణీ చేశారన్నారు.

News January 7, 2026

WGL మార్కెట్లో చిరుధాన్యాల ధరల్లో స్వల్ప తేడాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కి బుధవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,850 ధర రాగా..ఈరోజు రూ.8,700కి తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయకి మంగళవారం రూ.5,500 ధర వస్తే.. నేడు రూ.5,970 అయింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,080 పలికితే.. నేడు రూ.2,060 పలికింది. దీపిక రకం మిర్చికి మంగళవారం రూ. 16,500 ధర ఉంటే..ఈరోజు రూ.17,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.