News December 14, 2024
‘పోలీస్ బోర్డు’తో దర్జాగా గంజాయి రవాణా

గంజాయి అక్రమ రవాణాకు నిందితులు తమ వాహనాలకు ఏకంగా ‘పోలీస్ బోర్డు’ను తగిలించుకుని తరలించడం విస్మయం కలిగిస్తోంది. గురువారం రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 810 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిందితులు తెలివిగా పోలీసులు, చెక్ పోస్టుల నుంచి తప్పించుకోవడానికి తమ వాహనాలకు ఏకంగా పోలీస్ బోర్డు, ఫేక్ నెంబర్ ప్లేట్లు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News July 6, 2025
VZM: 2,232 పాఠశాలు.. 2,10,377 మంది విద్యార్థులు

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ శనివారం తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాల నుంచి 2,10,377 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.
News July 6, 2025
ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. విజయనగరంలో 473, పార్వతీపురంలో 119, బొబ్బిలి 69, సాలూరులో 229, శృంగవరపుకోటలో 47, గజపతినగరంలో 347, చీపురుపల్లిలో 38, కొత్తవలసలో 320, కురుపాంలో 14 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
News July 5, 2025
విజయనగరం: మా భవాని ‘బంగారం’

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.