News January 4, 2025
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే: ఇన్ఛార్జి సీపీ
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే అని నిజామాబాద్ ఇన్ఛార్జి సీపీ సింధూ శర్మ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్లో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్లో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజల మనోభావాలకు భంగపర్చకుండా ప్రజల మన్ననలను పొందాలని ఆమె ట్రైనింగ్ పొందిన కానిస్టేబుళ్లకు సూచించారు.
Similar News
News January 14, 2025
NZB: పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్ మంగళవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News January 14, 2025
భీమ్గల్: సెల్ఫీ వీడియోపై స్పందించిన ఎస్ఐ
భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కూరి నికేష్ సెల్ఫీ వీడియోపై ఎస్ఐ మహేశ్ స్పందించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పలుమార్లు స్టేషన్కు పిలిచినా రాలేదన్నారు. తప్పించుకు తిరుగుతూ పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో హింసించ లేదని, అతని ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
News January 14, 2025
NZB: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.