News February 28, 2025
పోలీస్ స్టేషన్కు వచ్చే వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి: CP

ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో స్టేషన్ అధికారులు ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝూ ఆదేశించారు. ఇదే రీతిలో సీఐ, డివిజినల్ స్థాయి పోలీసులు సైతం పనిచేయడం ద్వారా ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరగడంతో పాటు సమస్య పరిష్కారం అవుతుందని బాధితుడికి నమ్మకం కలుగుతుందని అధికారులకు తెలిపారు.
Similar News
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.