News September 24, 2024

పోలీస్ స్టేషన్‌లో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు జిల్లా SRపురానికి చెందిన కుమార్ ఒంగోలు PSలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందిన సమాచారం..అప్పులు చేసి పరారై ఒంగోలు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అప్పులోళ్లు శనివారం ఒంగోలు వచ్చి టీడీపీ నేత సాయంతో ఘర్షణకు దిగారు. పోలీసులు అందరినీ స్టేషన్‌కు పిలిపించి సర్ది చెప్పారు. మళ్లీ వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి.. SI చేయిచేసుకున్నాడంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Similar News

News February 27, 2026

CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

image

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 27, 2026

చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

image

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.

News February 27, 2026

74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.