News April 10, 2025
పోషణ్ అభియాన్-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జనగామ కలెక్టర్

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేపట్టే పోషణ్ అభియాన్-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మహిళ శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఐసీడీఎస్ పోషణ్ అభియాన్-పోషణ పక్షం 2025 కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు.
Similar News
News October 25, 2025
దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.
News October 25, 2025
JMKT: మార్కెట్కు రెండు రోజులు సెలవు

JMKT మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.
News October 25, 2025
పెద్దపల్లి జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కోదాటి శ్రీనివాసరావు

తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కోదాటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను బలోపేతం చేయాలని శ్రీనివాసరావు కృషి చేస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకంపై అభిమానులు, ప్రజలు, జాగృతి కార్యకర్తలు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు.


