News February 27, 2025
పోసానిపై థర్డ్ డిగ్రీ: కొరముట్ల

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోసానిని గురువారం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోసానిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అనుమతించకపోవడంతో పోసానిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. విచారణ అనంతరం మాట్లాడిస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 29, 2025
విజయమే లక్ష్యం.. జూబ్లీహిల్స్ కోసం కేబినెట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయానికి ఉన్న అవకాశాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు బాధ్యతలు అప్పగించిన పార్టీ ఇపుడు మంత్రి వర్గంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తప్ప అందరికీ బాధ్యతలు అప్పగించింది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించి ప్రచారం చేపట్టనుంది. స్థానిక నేతలను సమన్వయ పరుస్తూ ఈ ప్రచారం కొనసాగనుంది.
News October 29, 2025
సంగారెడ్డి: తుఫాన్ ఎఫెక్ట్.. జాతీయ రహదారిపైకి వరద

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామ శివారులో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు డౌన్గా ఉండడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. నేషనల్ హైవే అధికారులు స్పందించి వరద నీటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News October 29, 2025
డోర్నకల్లో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 104.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కురవిలోని అయ్యగారి పల్లిలో 90 మిల్లి మీటర్లు, మహబూబాబాద్ మండలంలో అమనగల్ 89.3, మల్యాలలో 70.8, గూడూరు మండలంలోని భూపతి పేటలో69.0, తొర్రూర్ 67.5, గార్లలో 65 మిల్లి మీటర్లు, గంగారంలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.


