News June 1, 2024
పోస్ట్ పోల్ సర్వే.. ఉమ్మడి తూ.గో.లో 3 MP స్థానాలు కూటమివే

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 15 నుంచి 17 స్థానాల్లో, వైసీపీ 2- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ స్థానంలో టీడీపీ, రాజమండ్రి నుంచి బీజేపీ, కాకినాడ నుంచి జనసేన గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.
Similar News
News October 18, 2025
నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి – కలవచర్ల మార్గంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు (45) మృతి చెందాడు. కోరుపల్లి అడ్డరోడ్డు వద్ద నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు.
News October 18, 2025
నిడదవోలు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

నిడదవోలు మండలం డి. ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు, కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ, ఆర్డీఓ సుస్మితా రాణి పాల్గొన్నారు.
News October 16, 2025
క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు: కలెక్టర్

రాజమహేంద్రవరం జీజీహెచ్లోని ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. గురువారం ఆసుపత్రిలో ఆమె వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.