News March 25, 2025

ప్యాపిలి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

image

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన ఐఐటీ స్టూడెంట్ అరుణ్ కుమార్ పంజాబ్‌లో ఈ నెల 15న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోలుకోలేక నిన్న మృతి చెందాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పంజాబ్‌లో ఐఐటీ చదువుతున్న అరుణ్ క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.

Similar News

News October 19, 2025

PHOTOS: పార్వతీపురం ఘటనలో గాయపడ్డ వారు వీరే

image

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణసంచా <<18049906>>పేలిన ఘటన<<>>లో ముగ్గురు గాయపడ్డారు. బస్సు నుంచి క్రాకర్స్ పార్శిల్ బాక్స్ దింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. క్షతగాత్రులను పై ఫొటోలలో చూడొచ్చు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 19, 2025

ఖమ్మం: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. గేదెలకు కట్టారా?

image

వైరా(M) గరికపాడులో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఆవరణ ప్రస్తుతం గేదెలకు కొట్టాలుగా మారాయి. ఈ ఇళ్లలో గేదెలను కడుతున్న యజమానులను గ్రామ కార్యదర్శి హెచ్చరించినా, 2 సార్లు నోటీసులు ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదు. గత నెల 9న గ్రామసభలో MRO సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణం పూర్తి చేసి, అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News October 19, 2025

గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

image

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.