News March 20, 2025

ప్యాపిలి: స్కూల్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు

image

ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ యం.బొజ్జన్న విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు చెప్పారు.

Similar News

News November 13, 2025

కరీంనగర్: విద్యాశాఖలో ఆ ‘FILE మాయం’..!

image

పదో తరగతి పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాలు అమ్మగా వచ్చిన నిధులకు సంబంధించిన ఫైల్ కరీంనగర్ విద్యాశాఖలో మాయమైనట్లు తెలుస్తోంది. 2022- 23 MAR, JUN మూల్యాంకన పత్రాలను అధికారులు అమ్మారు. కాగా, దీని ద్వారా వచ్చిన రూ.1.30 లక్షలు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. దీనిపై అటు సూపరింటెడెంట్ ఇటు ఆఫీసు సిబ్బంది ఒకరిపైఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ గోల్‌మాల్ ముఖ్యమైన విద్యాశాఖను అభాసుపాలు చేస్తోంది.

News November 13, 2025

జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు..!

image

జిల్లా రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ గురించి సరిగా తెలియకపోవడం, తెలిసినా అందులో ఫార్మర్ నాట్ రిజిస్టర్ అని చూపించడం, ఎవరి పేరు మీద ఎంత పత్తి ఉందో, ఎంత వరి ఉందో తెలియకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకొని వారికి వెంటనే రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.

News November 13, 2025

నేటి నుంచే అరకు-యెలహంకా ప్రత్యేక ట్రైన్లు

image

నేటీ నుంచే దువ్వాడ మీదుగా అరకు-యెలహంకా మధ్య స్పెషల్ ట్రైన్‌లు (08551/08552), (08555/08556) నడవనున్నాయి. ఈనెల 13, 17, 23, 24 తేదీల్లో అరకు నుంచి మ.12కి స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది. తిరుగుపయనం ఈనెల 14, 24, తేదీల్లో యెలహంకా నుంచి మ.1.30 గంటకి, అదేవిధంగా 18, 25 తేదీల్లో యలహంక నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.