News June 27, 2024

ప్రకాశం:‘ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలి’

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి నిర్వహించిన వీడియో కార్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. నూరు శాతం పంపిణీ తొలిరోజే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని చెప్పారు.

Similar News

News December 29, 2025

ప్రజల్లో విశ్వాసం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణతోపాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించాలన్నారు.

News December 29, 2025

ప్రకాశం: నేటి కార్యక్రమం రద్దు

image

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.

News December 28, 2025

రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

image

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.