News December 25, 2024

ప్రకాశంలో మొదటి సారి భూ ప్రకంపనలు ఎప్పుడు వచ్చాయంటే?

image

ప్రకాశం జిల్లాలోని తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో గత మూడు రోజులుగా 7 సార్లు భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన జిల్లాలో 1800వ సంవత్సరం నుంచి తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 1905, 2016, 2021, 2023లో ఒంగోలు, బల్లికురవలో భూమి కంపించింది. మైనింగ్, భూగర్భజలాలు తోడేయడం భూప్రకంపనలకు కారణం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

Similar News

News November 20, 2025

ప్రొద్దుటూరు: మొబైల్ చూస్తూ డ్రైవింగ్.. మరణానికి నాంది!

image

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మృత్యువుకు దారి వేసినట్లేనని ప్రకాశం పోలీస్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.

News November 20, 2025

మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

image

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.

News November 20, 2025

మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

image

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.