News January 3, 2025
ప్రకాశం: అరుదైన మొక్కల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్
పక్కాగా అందిన సమాచారంతో అరుదుగా కనిపించే మొక్కలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒంగోలులో గురువారం చోటుచేసుకుంది. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు
Similar News
News January 24, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు అవార్డు
ఉత్తమ ఎన్నికల అధికారిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కింద ఈ పురస్కారం వరించింది. జిల్లా కలెక్టర్తో పాటు. దర్శి మండలం తహశీల్దార్ శ్రావణ్ కుమార్ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం జరుగుతుంది.
News January 24, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసిన మహిళా ఉద్యోగులు
ఏపీ JAC అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా చైర్ పర్సన్ జయలక్ష్మి గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, వారు పనిచేసే చోట వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అసోసియేషన్ భవనం ఏర్పాటు చేయుటకు పట్టణంలో స్థలం కేటాయించవలసిందిగా అర్జీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జయలక్ష్మి తెలిపారు.
News January 24, 2025
ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి గుణాత్మక విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు అన్నారు. గురువారం ఒంగోలులో జరిగిన ప్రకాశం- నెల్లూరు జిల్లాల విద్యాశాఖ అధికారుల, ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. గతంలో ప్రభుత్యం జారీ చేసిన జీవో 117ను మారుస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.