News March 30, 2024
ప్రకాశం: ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711760496213-normal-WIFI.webp)
సింగరాయకొండ మండలం పెదనబోయినవారిపాలెంకు చెందిన కావలి పద్మ, రమాదేవి, ప్రహర్ష సింగరాయకొండ నుంచి ఆటోలో గ్రామానికి బయల్దేరారు. ఊళ్లపాలెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీ సమీపంలోకి వెళ్లేసరికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని ఒంగోలు తరలిస్తుండగా పద్మ మధ్యలో మృతిచెందారు. ఎస్సై శ్రీరాం కేసు నమోదుచేశారు.
Similar News
News January 17, 2025
ప్రకాశం: నేడే విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737080842084_52019922-normal-WIFI.webp)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్- డే అని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 17, 2025
ప్రకాశం: రాకాసి అలలకు ఓ ఫ్యామిలీ బలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737076861790_928-normal-WIFI.webp)
ప్రకాశం జిల్లా పాకల తీరంలో <<15170746>>నిన్న ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పొన్నలూరు మండంలం శివన్నపాలేనికి చెందిన మాధవ(25) ఫ్యామిలీ సముద్ర స్నానానికి వెళ్లింది. అలల తాకిడికి మాధవ చనిపోయాడు. ఆయన భార్య చెల్లెలు యామిని(15), బాబాయి కుమార్తె జెస్సిక(14) సైతం కన్నుమూసింది. మాధవ భార్య నవ్య సైతం సముద్రంలోకి కొట్టుకుపోతుండగా.. మత్స్యకారులు కాపాడారు.
News January 17, 2025
బాల్య వివాహలు లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: ప్రకాశం కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737040603622_51971987-normal-WIFI.webp)
ప్రకాశం జిల్లాను బాల్య వివాహాలు, బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగుల్లో ఒకరికి శిక్షణ ఇచ్చి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.